అమరావతి: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎస్సీ, ఎస్టీ లపై దౌర్జన్యం చేసారనే కేసు నమోదైంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మంచి నీటి చెరువు వద్ద ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభ సమయంలో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ను తెదేపాలు కులం పేరుతో దూషించారని మునిసిపల్ సూపర్వైజర్ కోడిరెక్క సునీత అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రత్తిపాటితో పాటు పలువురు టీడీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ పీఏఓ యాక్ట్ 323, 34, 353, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో తొలి ముద్దాయిగా పుల్లారావును దాఖలు చేసారు.