రుణ వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచిన ఎస్బీఐ

రుణ వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచిన ఎస్బీఐ

హైదరాబాదు: ఎస్బీఐ రుణ వడ్డీ రేట్లను 0.10 శాతం వంతున పెంచింది. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. దీంతో ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 7.10 శాతానికి చేరింది. దాదాపు అధిక శాతం రుణాలు ఏడాది కాల ఎంసీఎల్ఆర్ ఆధారిత రేటుకే అనుసంధానమై ఉంటాయి. రెండేళ్ల ఎంసీఎల్ఆర్, ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లనూ ఇదే స్థాయిలో పెంచింది. కనుక పెరిగిన రేట్ల మేర ఈఎంఐను పెంచి కట్టాలి. లేదంటే ముందున్న ఈఎంఐనే చెల్లిస్తూ కాల వ్యవధిని పెంచుకోవచ్చు.
ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటిపోవటంతో ధరల కట్టడికి ఆర్బీఐ కీలక రేట్లను జూన్ సమీక్షలో పెంచొచ్చని విశ్లేషకుల అంచనా. రెపో రేటును ఆర్బీఐ పెంచితే అప్పుడు కూడా రుణ రేట్లు మరింత పెరిగేందుకు దారి తీస్తుంది. రెపో ఆధారిత రేట్లను కూడా బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. కనుక వేగంగా పెరిగిన రేట్ల భారాన్ని బ్యాంకులు వినియోగదారులకు బదలాయిస్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos