చమురు ధరలు..ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెరిగింది

చమురు ధరలు..ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెరిగింది

న్యూ ఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 76 పైసలు వంతున పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.113.61, డీజిల్ రూ.99.83కు, దిల్లీలో 80 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 25 పైసలకు, డీజిల్ ధర 91 రూపాయల 51 పైసలకు పెరిగింది. ధరలు ఎనిమిది రోజుల్లో ఏడుసార్లు పెరగడం గమనార్హం. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.115.37, డీజిల్ రూ.101.23కు ఎగబాకింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos