న్యూ ఢిల్లీ : నెల రోజుల కిందట దేశంలో వ్యాపారాన్ని ప్రారం భించిన ప్రముఖ ఈ కామర్స్ సంస్థ – షాపీ మూత బడింది. సింగపూర్కు చెందిన సీ లిమిటెడ్ ఈ సంస్థను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల దీనికి కారణంగా భావిస్తున్నారు. భారత్లో పని చేస్తున్న 300 మంది సిబ్బందికి వేరే ఉద్యోగాలు ఇప్పించడంలో సహకరిస్తామని తెలిపింది. ఉద్యోగం పొందలేని వారికి పరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీ గ్రూపునకు చెందిన గరేనా ఫ్రీ ఫైర్ సహా 54 చైనా యాప్లను భారత ప్రభుత్వం ఇటీవల నిషేధించింది.