తిరుపతి: మ విఫలం అవుతుందన్న భయంతో ఇక్కడి వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పద్మావతి జూనియర్ కళాశాల, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కళాశాలకు వసతి గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు కె.విపల్లి మండలం గర్నిమిట్టకు చెందిన విష్ణుప్రియగా పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం కువైట్కి వెళ్లడంతో విష్ణుప్రియ హాస్టల్లో ఉంటూ చదువుతోంది. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో విష్ణుప్రియ ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో 3 ప్రేమలేఖలు, బహుమానాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి పడమటి చర్చి సమీపంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నాగేంద్ర కుమార్ అనే విద్యార్థి హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పుంగనూరు మండలం భీమగానిపల్లివాసిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఎస్వీయూ క్యాంపస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.