పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష

పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష

అహ్మదాబాద్ : అహ్మదాబాద్ సీరియల్ పేలుళ్ల కేసులో గుజరాత్ ప్రత్యేక కోర్టు శుక్రవారం 38 మంది దోషులకు ఉరి శిక్ష విధించింది. మరో 11 మందికి జీవిత ఖైదు విధిం చింది. దేశంలో ఒక్క పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదలు. 2008 జులై 26 న 70 నిమిషాల వ్యవధిలో అహ్మదాబాద్లో జరిపిన వరుస బాంబు పేలుళ్లలో 56 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. 13 ఏళ్ల తర్వాత ప్రత్యేక కోర్టు గత వారం 49 మందిని దోషులుగా, 28 మందిని నిర్దోషులుగా ప్రకటిం చింది. భారతీయ శిక్షాస్మృతి, ఉపా, పేలుడు పదార్థాల చట్టం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితులను దోషులుగా నిర్ధారించారు. ఆయుధ చట్టం కింద ఒక నిందితుడిని కూడా దోషిగా నిర్ధారించారు.ఐపీసీలోని ఇతర సెక్షన్లు 302 (హత్య), 307 (హత్య ప్రయత్నం), 121 (ఎ) 124 (ఎ) (విద్రోహం) కింద నిందితు లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. గత ఏడాది సెప్టెంబర్లో 77 మంది నిందితులపై విచారణను కోర్టు ముగించింది. విచారణలో ఉన్న 78 మంది నిందితుల్లో ఒకరు అప్రూ వర్గా మారారు.నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)తో సంబంధమున్న వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos