లడఖ్ : చైనా సరిహద్దుల్లో భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. తూర్పు లడఖ్ వివాదానికి కారణమైన చైనా పై భారత్ నిప్పులు చెరిగింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంట భద్రత పెంచారు. అవతలి వైపు చైనా గణనీయమైన మౌలిక సదుపాయాలను నిర్మించింది. అయినా భారత సైన్యం ఎలాంటి పరిస్థితులకైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే చెప్పారు. తూర్పు లడఖ్లో సైన్యం కార్యాచరణ సన్నద్ధతను సమీక్షించారు.