నెల్లూరులో రెండు రైల్వే వంతెనలు కట్టండి

నెల్లూరులో రెండు రైల్వే వంతెనలు కట్టండి

నెల్లూరు : నగరంలో రెండు రైల్వే బ్రిడ్జిలను నిర్మించాలని లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి రైల్వే జీఎం గజానన్ మాల్యాకు విన్నవించారు. విజయవాడలో గురువారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పారల్లమెంటు సభ్యులతో ఆదాల పాల్గొన్నారు. రంగనాయకులపేట లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి, కొండాయపాలెం లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద రైల్ అండర్ బ్రిడ్జిని కట్టాలని కోరారు. అవి లేక స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. బిట్రగుంట రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న 1600 ఎకరాల ఖాళీ స్థలంలో ఒక పరిశ్రమ ఏర్పాటుకు సిఫార్సు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మిగతా వ్యవహారాలు నడిపిస్తామని చెప్పారు. సింగరాయకొండ రైల్వే స్టేషన్ తో సహా ముఖ్యమైన స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఉండేచోట లిఫ్ట్ లు ఏర్పాటు చేయాలని కోరారు. సీనియర్ సిటీజన్లకు మహిళలకు సౌకర్యం కలుగుతుందన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే మార్గం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇచ్చేందుకు సరైన పరిస్థితులు లేనందున రైల్వే నిధులతోనే పూర్తి చేసేందుకు సిఫార్సు చేయాలని కోరారు. కొడవలూరు మండలం లోని రాజుపాలెం లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్.వి.ఎన్.ఎల్ సంస్థ మూడో రైల్వే లైన్ పనులు చేస్తోందని, ఆ సంస్థకు సామాజిక బాధ్యత కింద నెల్లూరు నగరంలో మూడో రైల్వే లైన్ కు సమాంతరంగా ఉన్న ఖాళీ ఉన్న స్థలాల్లో పార్కులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos