జమ్మూ: అవంతిపొరా పరిధిలోని నాగబరాన్ ట్రాల్ ప్రాంతంలో శనివారం కేంద్ర భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు. నాగబరాన్ ట్రాల్ అడవుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న కేంద్ర భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతాబలగాలు ఎదురు కాల్పులకుదిగారు. భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.