స్టాక్ మార్కెట్లు నష్టాల్లో

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధ వారం నష్టాల్లో ముగిశాయి. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటి వరకు స్థిరంగా కొనసాగినప్పటికీ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారు కున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 55,629కి,  నిఫ్టీ 45 పాయింట్లు కోల్పో యి  16,568 వద్ద ఆగింది.  సెన్సెక్స్ లో అల్ట్రాటెక్ సిమెంట్ (2.46%), బజాజ్ ఫైనాన్స్ (2.12%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.78%), నెస్లే ఇండియా (0.91%), బజాజ్ ఆటో (0.89%) లాభాల్ని గడించింది. ఐసీఐసీఐ బ్యాంక్ (-1.80%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.42%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.11%), హెచ్డీఎఫ్సీ లిమి టెడ్ (-1.06%), యాక్సిస్ బ్యాంక్ (-0.74%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos