జమ్ము: శ్రీనగర్ దాన్మార్లోని అలందార్ కాలనీలో శుక్రవారం ఉదయం భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవా దులు హతమయ్యారు. ముష్కరు కోసం భద్రతా సిబ్బంది తనిఖీలు చేసినపుడు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురు కాల్పులు అనివార్య మయ్యా యి.
తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 78 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టు బెట్టా రని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. మృతుల్లో 39 మంది లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, అల్బదర్, జైషే మహ్మద్, అన్సార్ గజ్వాత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలకు చెందినవారు.