అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్పత్రులు డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా విధించాలని ప్రభుత్వం శుక్ర వారం ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి తప్పుచేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్ హెచ్చరించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లనూ ఆదేశించారు.