అమరావతి: పంటను రైతే నేరుగా వినియోగదారుడికి అమ్మితే అధిక ఆదాయాన్ని పొందవచ్చు. రాష్ట్రంలో విస్తరిస్తున్న చెరకు రసం వ్యాపారం ఇందుకు తార్కాణం. ప్రస్తుతం 265 మంది వరకు రైతులు చెరకు నుంచి రసం వ్యాపారాన్ని చేపట్టి లాభాల తీపి ఆర్జిస్తున్నారు.రూ.లక్ష -రూ.2 లక్షల మధ్య ధర ఉన్న అధునాతన చెరకు రసం యంత్రాలు అందుబాటులోకి రావడంతో చిన్న, సన్నకారు రైతులు ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. చెరకు ధర బాగా పతనమైన దశలో చేపట్టిన ఈ వ్యాపారం లాభసాటిగా ఉందని రైతులు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన రైతు వీరారెడ్డి, నెల్లూరుకు చెందిన మరో రైతు రామమోహన్రెడ్డి చెప్పారు. నాబార్డ్లోని నాబ్–కిసాన్ విభాగం వ్యక్తుల జీవనోపాధి, ఆదాయ పెంపు కార్యకలాపాలకు రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీవోలు) ద్వారా రుణం ఇస్తుంది. ఎఫ్పీవోలో ఉండే మూలధనానికి ఐదు రెట్ల రుణాన్ని ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇస్తుంది. సక్రమ చెల్లింపుల అనంతరం వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. నేరుగా నాబార్డు రుణం ఇవ్వదని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజరు ఎం సుధీర్కుమార్ చెప్పారు. ఆత్మనిర్భర భారత్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చిరు వ్యాపారులకు 35 శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తోంది. చెరకు రసం తీసే ఈ యంత్రం ఏటీఎం తరహాలో ఉంటుంది. చెరకు ముక్కల్ని నిమ్మకాయ, అల్లాన్ని ఉంచితే లోటాలోకి రసం వస్తుంది. . టన్ను చెరకు నుంచి 500 లీటర్ల వరకు రసాన్ని తీయొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ రసం ధర రూ.60- రూ.80 వరకు పలుకుతోంది. రైతులు తే దాన్ని రూ.50కి అమ్మినా 500 లీటర్లకు రూ.25 వేల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులు పోగా టన్ను చెరకుకు నికరంగా రూ.17 వేల నుంచి రూ.18 వేలు మిగులుతాయి. ప్రస్తుతం టన్ను చెరకును రూ.7 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు.