చైనాతో చర్చలు వృథా – దేశ భద్రతకు ముప్పు

చైనాతో  చర్చలు వృథా – దేశ భద్రతకు ముప్పు

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్లే భారత జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. చైనాతో కేంద్రం జరిపే చర్చలను వ్యర్థమైనవిగా పేర్కొన్నారు. హాట్స్ప్రింగ్స్, గోగ్రా, దెస్పాంగ్లోని భూభాగాలను చైనా ఆక్రమించడం డీబీఓ వైమానిక స్థావరానికి, దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. సరిహద్దుల్లో చైనా బలగాలు వెనుదిరగడానికి నిరాకరించయన్న వార్తలకు రాహుల్ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
ఎందుకు ఫలప్రదం కాలేదు?
“గోగ్రా, దెస్పాంగ్ సహా ఇతర ఉద్రిక్త ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై చర్చలు ఎందుకు ఫలించలేదు. గల్వాన్ లోయలో పాయింట్-14 సహా ఇతర ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించాలనే ప్రభుత్వ నిర్ణయం భారత్కు అనుకూలమేనా? ఈ ప్రాంతాల్లో ఏప్రిల్ 20కి ముందున్న యథాతథ స్థితిని ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు తీసుకు రాలేక పోతున్నారు? సైనిక చర్చలు విఫలమైన తర్వాత చైనా నుంచి భారత భూభాగాలను రాబట్టుకోవడానికి మోదీ ప్రభుత్వం ఏ ప్రణాళికను అనుసరిస్తోంది? చర్చల తర్వాత కూడా.. సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి ముందడుగు పడలేద’ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకన్ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos