రాంచీ : పశువుల దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్ లభించింది. మొత్తం నాలుగు కేసుల్లో ఆయన దోషిగా తేలగా.. ఇదివరకే మూడు కేసుల్లో బెయిల్ వచ్చింది. నాలుగో కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దుమ్కా ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులను మళ్లించిన కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చింది. దాణా కుంభకోణానికి సంబంధించి నాలుగు కేసుల్లో లాలూకు శిక్ష ఖరారైంది. ఇందులో మూడింటికి ఇప్పటికే బెయిల్ లభించింది. తాజా బెయిల్తో.. జైలు నుంచి విడుదలయ్యేందుకు లాలూకు మార్గం సుగమమైంది.