ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఇందుకు కారణం. బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు కోల్పోయి 49,771కు, నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 14,793కు పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో టెక్ మహీంద్రా (2.38%), టీసీఎస్ (2.17%), సన్ ఫార్మా (2.07%), ఇన్ఫోసిస్ (1.87%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.75%) బాగా లాభ పడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.33%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.95%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.23) నష్ట పోయాయి.