న్యూ ఢిల్లీ: కరోనా జోరుగా ఉన్న సమయంలో,లాక్డౌన్ అమల్లో ఉన్న 2020-21 లో పెట్రోల్, డీజిల్ అమ్మకం ద్వారా 2.94 లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేసినట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. లోక్సభలో మంగళవారం మల్కాజిగిరి సభ్యుడు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రదాన్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2013 లో (కాంగ్రెస్ హయాములో) 52,537 కోట్లు , 2018-19లో రూ.2.13 లక్షల కోట్లు , 2019-20లో రూ.1.78 లక్షల కోట్లు, 2020-21లో రూ.2.94 లక్షల కోట్లు ఆదాయాన్ని గడించినట్లు విపులీకరించారు.