అమెరికాలో నిరసనల హోరు

అమెరికాలో నిరసనల హోరు

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఇంకా స్పష్టత రాని దశలో డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ అనుకూల వ్యతిరేక వర్గాల నిరసనలతో అగ్రరాజ్యం హోరెత్తుతోంది. న్యూయార్క్ ఎన్నికల్లో ప్రతి ఓటునూ లెక్కించాలని డిమాండ్ చేస్తూ అక్కడి వాషింగ్టన్ స్క్వేర్ వద్ద నిరసనలు జరిగాయి. కూడలిలో బైఠాయించిన ఆందోళనకారులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, వర్ణ వివక్షను రూపుమాపాలని నినాదాలు రాసిన అట్టలతో నిరసించారు. మిషిగన్, పెన్సిల్వేనియాలో ట్రంప్ దావా వార్తలతో హింసకు పాల్పడ్డారు. . కనీసం 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూయార్క్లో వస్తువులకు నిప్పంటించారు. ప్రతి ఓటూ లెక్కించాలనే డిమాండ్తో ఫిలడెల్ఫియాలోనూ ఆందోళన నిర్వహించారు. కార్మిక సంఘాలకు చెందిన 200 మంది ప్రతినిధులు అక్కడి ఇండిపెండెన్స్ హాల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తామంతా వీధుల్లోకి వచ్చినట్లు చెప్పారు. సియాటెల్లోనూ నిరసనలు జరిగాయి. ‘నల్ల జాతీయుల ప్రాణాలు ముఖ్యమే’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతి ఓటును లెక్కించాలని మాన్హట్టన్లో ప్రదర్శన నిర్వహించారు. న్యాయం, ప్రజాస్వామ్యానికి మద్దతుగా ర్యాలీలు చేశారు. ఆందోళనలు దాదాపు శాంతియుతంగానే జరిగాయి. ‘ట్రంప్ వెళ్లిపో’ డిమాండ్తో షికాగోలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ట్రంప్ తన ఓటమిని అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఒరెగాన్లోని పోర్ట్ల్యాండ్లో ఓట్లన్నీ లెక్కించాలనే డిమాండ్తో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. కొన్ని చోట్ల భవనాల కిటికీలను ధ్వంసం చేశారు. వారిని అదుపు చేసేందుకు నేషనల్ గార్డ్స్ను ప్రభుత్వం వెంటనే రంగంలోకి దించింది. మిన్నియాపొలిస్లో ఆందోళన చేసినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్ట్లాండ్లో జాతీయ పతాకానికి నిరసన కారుల్లో ఒకరు నిప్పుపెట్టారు. జో బైడెన్ మిషిగన్లో గెలిచినట్లు వార్తలు రాగానే ఓట్లు లెక్కించే కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos