వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవిని అధిరోహించేదీ ఎవరో తేల్చే కీలక ఘట్టం కౌటింగ్ ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటల వరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం..ప్రస్తుత కా అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ముందంజలో ఉన్నారు. బిడెన్ 238 ఎలక్టోరల్ ఓట్లను పొందగా, డొనాల్డ్ 213 ఓట్లతో కొంత వెనుకబడ్డారు. సొంత రాష్ట్రాల్లో ఈ ఇద్దరు వెనుకబడటం ఆశ్చర్యకరం. ట్రంప్ సొంత రాష్ట్రమైన న్యూయార్క్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ గెలుపొందారు. ఈ రాష్ట్రంలో బిడెన్కు 37.89 లక్షల ఓట్లు పోలవ్వగా..ట్రంప్కు కేవలం 29.56 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. బిడెన్ సొంత రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ట్రంప్కు 29.65 లక్షల ఓట్లు పడగా, బిడెన్కు 22.90 లక్షల ఓట్లు లభించాయి. పెన్సిల్వేనియాలో పోలైన ఓట్లలో ఇప్పటి వరకు 64 శాతం ఓట్లను లెక్కించారు.