బాలీవుడ్ యువ హీరో సుశాంత్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ సుప్రీమ్ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇటు సినీ పరిశ్రమతో పాటు రాజకీయంగా సైతం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇదిలా ఉంటే సుశాంత్ కేసుకు సంబంధించి ఓ వాట్సాప్ చాటింగ్ తాజాగా నెట్లో రౌండ్లు కొడుతోంది.
ఇది సుశాంత్కు అప్పటి మేనేజర్ దిశా శాలియన్ మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్.ఏప్రిల్ 2వ తేదీన ఒకసారి ఆ తర్వాత అదే నెలలో 10వ తేదీ మధ్య వీరు పబ్జీ, ఓ ఫుడ్ ఆయిల్ బ్రాండ్ ప్రమోషన్ పైన చాటింగ్లో చర్చించుకున్నారు. ఆ తరువాత దిశ పబ్ జీ డిజిటల్ ప్రచారం కోసం ఏప్రిల్ 7న సుశాంత్ని కలిసిందని తెలుస్తోంది. అయితే ఇదంతా జరిగిన 2 నెలల తర్వాత ఏమైందో తెలియదు కానీ ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.