భారత్‌కు ఫ్రాన్స్‌ చేయూత

భారత్‌కు ఫ్రాన్స్‌ చేయూత

న్యూ ఢిల్లీ: కరోనాతో అల్లాడిపోతోన్న భారత్కు ఫ్రాన్స్ వెంటిలేటర్లు, టెస్ట్ కిట్లు, ఇతర వైద్య సామగ్రిని పంపించింది. ఇక్కడి ఫ్రాన్స్ రాయబారి ఇమ్యాన్యుయేల్ లెనైన్ వీటిని భారతీయ రెడ్క్రాస్ సొసైటీకి అందజేశారు. అవి 50 ఒసిరిస్ 3 వెంటిలేటర్లు, 70 యువెల్ 800 వెంటిలేటర్లు, 50 వేల టెస్ట్కిట్లు ,50 వేల స్వాబ్స్లు. కరోనాను ఫ్రాన్స్ సమర్థంగా కట్టడి చేసింది. భారత్లో మాత్రం కరోనా రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రతి రోజు 45 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఫ్రాన్స్లో మొత్తం 1,83,804 కేసులు నమోదు కాగా 30,200 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 14,83,157కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 33,425కి పెరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos