అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్ర ముప్పు

అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్ర ముప్పు

శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రికులపై దాడికి ఉగ్రవాదులు పన్నాగాల్ని పన్నినట్లు సమాచారం అందిందని భద్రతా అధికారులు తెలిపారు. ‘కుల్గాంలోని నాగర్ – చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ అధినేతతో పాటు మరో ఇద్దరు ఉగ్ర వాదులు హతమయ్యారు. మరో నాలుగు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న దశలో ఉగ్రవాదుల దాడులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాడులను అడ్డుకోవడానికి తగిన సైనిక వ్యవస్థ, వనరు లున్నాయి. యాత్రను శాంతి యుతంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాము’ అని బ్రిగేడియర్ వివేక్ సింగ్ ఠాకుర్ తెలిపారు. అమర్నాథ్ యాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా సాగడానికి భద్రతపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. 44 నెంబరు జాతీయ రహదారిలో అమర్నాథ్ యాత్ర సాగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos