ముంబై: వంట గ్యాస్ ధరలు స్వల్పంగా పెరిగాయి. మెట్రో నగరాల్లో సబ్సిడీ లేని సిలిండర్ ధర గరిష్ఠంగా రూ. 4.50 వరకూ పెంచినట్లు చమురు సంస్థలు బుధవారం ఇక్కడ తెలిపాయి. పెంచిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. కోల్ కతా, హైదరాబాద్ నగరాల్లో రూ. 4.50, చెన్నైలో రూ. 4, ముంబైలో రూ. 3.50, ఢిల్లీలో రూపాయి చొప్పున ధరలు పెరిగాయి. దీని ప్రకారం ప్రకారం, 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర హైదరాబాద్ లో రూ. 645.50, ఢిల్లీలో రూ. 594, కోల్ కతాలో రూ. 620.50, ముంబయిలో రూ. 594, చెన్నైలో రూ. 610కి చేరుకున్నాయి. గత నెల్లో కూడా వంట గ్యాస్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే