న్యూ ఢిల్లీ : భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ మన సైనికులు 76 మంది గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్నారు. ఎవ్వరూ తీవ్రంగా గాయపడలేదని అధికార వర్గాలు తెలిపాయి. 18 మంది లేహ్లో చికిత్స పొందు తున్నారు. రెండు వారాల్లో విధులకు హాజరు కానున్నారు. మిగిలిన వారు వారంలో విధులకు హాజరుకానున్నారు.