హోసూరు : అడవిలో తప్పించుకున్న మేకను వెదుకుతూ వెళ్లిన రైతుపై ఏనుగు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. కృష్ణగిరి జిల్లా డెంకణీకోట సమీపంలోని చిన్నబూదుకోట గ్రామానికి చెందిన చెన్నప్ప మంగళవారం కలను అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో మందలోని ఓ మేక తప్పిపోవడంతో దానిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. ఆతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు చెన్నప్పపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన చెన్నప్ప సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ సంఘటనపై డెంకణీకోట అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో శవాన్ని స్వాధీన పరచుకొని డెంకణీకోట ప్రభుత్వాస్పత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు.