భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కొహ్లీ సతీమణి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మపై బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల అనుష్కశర్మ నిర్మాతగా తీసిన వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’మతవిద్వేశాలు రెచ్చగొట్టేలా ఉందని.. జాతీయ భద్రతా చట్టం కింద కేసు ఫైల్ చేయాలని.. వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయాలని ఆయన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు ఎమ్మెల్యే గుర్జర్ లేఖ రాశారు.ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే గుర్జర్ తాజాగా అనుష్కపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అనుష్క దేశ ద్రోహీ అని.. విరాట్ కోహ్లీకి దేశం అంటే అపారమైన భక్తి ఉందని.. ఇండియా తరుఫున ఆడే కోహ్లీ వెంటనే అనుష్కకు విడాకులు ఇవ్వాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతోపాటు వెబ్సిరీస్లోని ఓ సన్నివేశంలో నంది కిషోర్ ఫొటోను ఆయన అనుమతి లేకుండా ఉపయోగించారని అనుష్కపై బీజేపీ ఎమ్మెల్యే కేసు పెట్టారు.