కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి విటమిన్లు,పోషకాలు ఎక్కువగా ఉన్నఆహారం తీసుకోవాలని తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో మన ఇంట్లో దొరికే వాటితో వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచుకోవచ్చో ఆయుష్మాన్ శాఖ సూచనలు చేసింది..
- ప్రతి రోజూ గోరువెచ్చని నీళ్లు తాగాలి.
- పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా వంటల్లో ఉండేలా చూసుకోవాలి.
- తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి మిశ్రమంతో కూడిన కషాయం రోజుకు ఒకసారి కానీ రెండు సార్లు కానీ తాగాలి.
- ఒక గ్లాసు వేడి పాలలో అరస్పూను పసుపు వేసి రంగరించి తాగాలి. ఎన్నో ఏళ్లుగా, వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ఇది తిరుగులేని చిట్కా.
- ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, లేకపోతే నెయ్యి కానీ ముక్కులో కొన్ని చుక్కలు వేసుకోవాలి.
- ఒక టేబుల్ స్పూను నువ్వుల నూనె లేదా వంట కోసం ఉపయోగించే కొబ్బరినూనె నోట్లో వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు పుక్కిలించాలి. ఆ తర్వాత వేడినీళ్లతో నోటిని శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజుకు ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ చేయాలి.
- అందుబాటులో ఉంటే ఓ టేబుల్ స్పూన్ చ్యవన్ ప్రాష్ మిశ్రమాన్ని ప్రతిరోజు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుంది.