భారత్‌తో పాటు పలు దేశాలపై చైనా కుట్రలు..

భారత్‌తో పాటు పలు దేశాలపై చైనా కుట్రలు..

కరోనా ప్రభావంతో ప్రపంచ ఆర్థిక పరిస్థితి కుప్పకూలడంతో పాటు పలు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి,ఆధిపత్య పోరుకు దారి తీస్తోంది.ఇప్పటికే చైనా-అమెరికాల మధ్య మాటల యుద్ధం శృతి మించగా చైనా-భారత్‌,నేపాల్‌-భారత్‌,చైనా-వియత్నాం,చైనా-తైవాన్‌ ఇలా చాలా దేశాల మధ్య పలురకాల వివాదాలు రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి.కరోనా పుట్టకకు చైనానే కారణమని కరోనా వైరస్‌ను పరిశోధనాలయాల్లో కృత్రిమంగా సృష్టించిన చైనా వైరస్‌ను ప్రపంచంపైకి వదిలిందని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి.ఇప్పటికే దీనిపై తీవ్ర ఆరోపణలు చేసిన అమెరికా కరోనా పుట్టుకపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేయగా అందుకు భారత్‌ సహ పలు దేశాలు మద్దతు ప్రకటించాయి.కరోనా కారణంగా పలు పెద్ద సంస్థలు చైనా నుంచి భారత్‌ తదితర దేశాలకు వెళ్లిపోవడానికి నిర్ణయించుకోవడంతో ఉక్రోశం పట్టలేని చైనా వివాదాలు సృష్టిస్తోందని స్పష్టమవుతోంది.అందులో భాగంగానే నేపాల్‌ను సైతం భారత్‌పైకి ఎగదోస్తోంది. భారత్తో పాటు పలు దేశాలపై చైనా కుట్రలపై అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేతసౌధం తాజాగా నివేదికలో పలు విషయాలు వెల్లడించింది. భారత్తో పాటు తమ పొరుగు దేశాలతో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని చెప్పింది. దేశాల సరిహద్దుల్లో చైనా దురుసుగా వ్యవహరిస్తోందని అమెరికా నేత ఒకరు ప్రకటించిన నేపథ్యంలో శ్వేతసౌధం ఇదే విషయంపై తమ నివేదికలోనూ విషయాన్ని పేర్కొనడం గమనార్హం.చైనా బలవంతపు సైనిక, పారామిలిటరీ ఆందోళనకు రెచ్చగొడుతోందని అమెరికా చెప్పింది. భారత్‌-చైనా సరిహద్దు విషయంతో పాటు దక్షిణ చైనా సముద్రం, ఎల్లో సీ, తైవాన్జలసంధి అంశాల్లో చైనా మాటలు ఒకలా ఉంటే, చేతలు మరోలా ఉన్నాయని పేర్కొంది. చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని చెప్పింది.తమ దేశం ఆర్థికంగా బలపడుతున్న కొద్దీ చైనీస్కమ్యూనిస్టు పార్టీ నేత బెదిరింపులు ఎక్కువవుతున్నాయని తెలిపింది. చైనా ప్రయోజనాలను, లక్ష్యాలకు అడ్డొచ్చే వారిని బెదిరించే ప్రయత్నం చేస్తోందని చెప్పింది. ప్రపంచ సమాచార సాంకేతికత వ్యవస్థను కొల్లగొట్టాలని చూస్తోందని తెలిపింది.ఇప్పటికే జాతీయ  సైబర్భద్రత చట్టం ద్వారా సమాచార స్థానికీకరణను చైనా తప్పనిసరి చేసిందని, ఇతర దేశాల సమాచారాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంటుందని తెలిపింది. చైనాను వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని పలు దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరముందని తెలిపింది. అమెరికా వ్యూహాత్మక విధానం ద్వారా ఆయా దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉందని శ్వేతసౌధం చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos