రజనీ అభిమానుల వితరణ

రజనీ అభిమానుల వితరణ

హొసూరు : రజినీకాంత్ అభిమాన సంఘ నాయకులు 200 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా గత నెల రోజులుగా రజనీకాంత్ అభిమాన సంఘ నాయకులు  పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పేద ప్రజలకు కూరగాయలు నిత్యవసర వస్తువులను ఉచితంగా అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. రజనీకాంత్ అభిమాన సంఘం పట్టణ కార్యదర్శి రోజా పాండియన్ అధ్యక్షతన డ్రైవర్లు, పెయింటర్ లు మరియు దోబీలు 200 మందికి నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమానికి కృష్ణగిరి జిల్లా రజనీకాంత్ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నిత్యావసర వస్తువులను వితరణ చేశారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  రజనీకాంత్ అభిమాన సంఘం నాయకులు మురుగన్, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాజా సమాచారం