లాక్ డౌన్ ఒక్కటే చాలదు

దిల్లీ: కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ ఒక్కటే సరిపోదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. గురువారం దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ‘‘లాక్డౌన్ కేవలం కరోనా వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుంది.. ఆ తర్వాత మళ్లీ విజృంభించే అవకాశముంది. కరోనాతో పోరాటానికి వైద్య పరీక్షలు గణనీయంగా పెంచాలి. ప్రస్తుతం వ్యూహాత్మకంగా వైద్య పరీక్షలు జరగట్లేదు. ర్యాండమ్ పద్ధతిలో వైద్య పరీక్షలు నిర్వహించాలి. కేరళలో జిల్లా స్థాయి వైద్య పరికరాలతో సమర్థంగా కట్టడి చేస్తున్నారు. వయనాడ్లో కరోనా నియంత్రణ సమర్థంగా జరుగుతోంది. కరోనాపై పోరులో కేరళ తీసుకున్న జాగ్రత్తలు అన్ని చోట్లా తీసుకోవాలి. రోజువారీ కూలీలు, కార్మికులు ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి ప్రణాళికలు రచించాలి. కరోనాపై పోరులో అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకోవాలి. తొలుత పేదలు, కూలీల ప్రాణాలు కాపాడాలి. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించాలి’అని రాహుల్ సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos