కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

దిల్లీ: భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 414 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బాధితుల సంఖ్య 12వేలు దాటింది. గడచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 941 పాజిటివ్ కేసులు, 37మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,380కి చేరింది. మొత్తం బాధితుల్లో 1489మంది కోలుకోగా ప్రస్తుతం మరో 10,477 మంది చికిత్స పొందుతున్నారు. ;బాధితుల్లో 76 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 170 జిల్లాలను హాట్ స్పాట్ ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. వీటిలో తెలంగాణలో ఎనిమిది, ఆంధ్రప్రదేశ్లో 11 జిల్లాలను హాట్ స్పాట్ ప్రాంతాలుగా గుర్తించింది. దేశంలోని ఆరు మెట్రో నగరాలు కూడా హాట్ హాట్ స్పాట్ ప్రాంతాలుఉన్నాయి. హాట్ స్పాట్ గుర్తించని ప్రాంతాల్లో ఏప్రిల్ 20నుంచి లాక్డౌన్ నిబంధనలకు సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos