విజయవాడ :మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాలంటే 14 రోజులు క్వారంటైన్లో ఉండి రావాల్సిందేనని మంత్రి మోపిదేవి వెంకట రమణ స్పష్టీకరించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ చంద్రబాబు నాయుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా తగిన సలహాలు ఇవ్వకుండా హైదరాబాద్లో కూర్చొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుకు అధికార యంత్రాంగం తల మునకలై పనిచేస్తున్నారు. రైతులకు నష్ట్రం రాకుండా అన్ని జాగ్రత్తలలు తీసుకున్నాం. ఆక్వా రంగానికి కనీస ధర నిర్ణయించాము. ఆక్వా ఫిషరీస్ రంగాలపై వచ్చిన నష్ట్రాలపై రెండు రోజుల్లో కేంద్రానికి నివేదిక అందజేస్తామ’ని పేర్కొన్నారు.