పోలీసు స్టేషన్లలో మహిళా ఎస్సైలకు బాధ్యతలు

తిరువనంతపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన పోలీస్ ఠాణాల నిర్వహణ నుంచి రైళ్లు నడపడం వరకు అన్ని బాధ్యతలు మహిళలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. మహిళా దినోత్సవాన అత్యధిక సంఖ్యలో పోలీసు స్టేషన్లలో మహిళా ఎస్సైలకు బాధ్యతలు అప్పగించాలని పోలీసు డైరెక్టర్ జనరల్ లోక్ నాథ్ బెహరా ఉత్తర్వుల్ని జారీ చేసారు. మహిళా ఎస్సైలు అందుబాటులో లేకపోతే వారి స్థానంలో సీనియర్ మహిళా పోలీసులకు బాధ్యతలు కేటాయించాలని సూచించారు. ఆ రోజు ఫిర్యాదులు, కేసుల పరిష్కారం అన్నీ మహిళా పోలీసు అధికారులే చూసుకుంటారని డీజీపీ వెల్లడించారు. ఇంకా ముఖ్యమంత్రి వాహన ఎస్కార్ట్ బాధ్యతలను మహిళా కమాండర్లకు అప్పగిస్తున్నారు. వైనాడ్ ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా మహిళా లోకో పైలెట్లనే నియమించ నున్నారు. పాయింట్స్ మన్, గేట్ కీపర్, ట్రాక్ సిబ్బంది అందరూ మహిళలే ఉంటారని కేరళ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos