పన్నులు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసుతో ఓ దినసరి కూలీ బెంబేలెత్తిపోయాడు.ఒడిశా రాష్ట్రంలోని నబరంగ్ పూర్ జిల్లాకు చెందిన సనధారా గంద్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2014-15లో ఈ వ్యక్తి రూ. 1.47 కోట్ల లావాదేవీలను నిర్వహించాడని… ఈ నేపథ్యంలో రూ. 2.59 లక్షల పన్నును చెల్లించాలంటూ అతనికి ఇటీవల ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి.దీంతో షాక్ గురైన సనధారా కూలి పనులు చేసుకునే తాను ఈ మొత్తాన్ని ఎలా చెల్లించగలనని ఆవేదన వ్యక్తం చేశాడు.గతంలో తాను పప్పూ అగర్వాల్ అనే వ్యక్తి ఇంట్లో ఏడేళ్లు పని చేశానని సనధారా గంద్ తెలిపాడు. ఆ సమయంలో తన భూమి పట్టాతో పాటు తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చానని… పప్పూ యాదవ్ తనను మోసం చేశాడని వాపోయాడు. మాజీ యజమాని ఏదో చేయబట్టే తనకు నోటీసులు వచ్చాయని దీనిపై అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశాడు..