ఆంధ్రాలో మరో ఊద్యోగాల జాతర

ఆంధ్రాలో మరో ఊద్యోగాల జాతర

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 15 వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు వివిధ దశల్లో విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్‌) విభాగాల్లో మొత్తం 15 వేల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటిలో పోలీసు శాఖలోని సివిల్‌, ఏపీఎస్పీ, ఏఆర్‌ విభాగాల్లో ఎస్సై, ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 11 వేల పోస్టులున్నాయి. అగ్నిమాపకశాఖలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఫైర్‌మెన్‌, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్‌, వార్డెన్, ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌ తదితర ఉద్యోగాలకు సంబంధించి నాలుగు వేల పోస్టులున్నాయి. విభాగాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఉద్యోగాల భర్తీ కోసం ఏటా ప్రభుత్వం విడుదల చేయనున్న క్యాలెండర్‌లో వీటికి చోటు కల్పించి దశల వారీగా భర్తీ చేయనున్నారు. తొలి దశలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే అంశంపై ఈ నెల మూడో వారం తర్వాత స్పష్టత రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షల్లో గ్రామ, వార్డు సచివాలయ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. భర్తీ కాని పోస్టులకు గాను తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పోలీసు శాఖలో మరో జంబో నోటిఫికేషన్ విడుదల కానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos