భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న కశ్మీర్ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామంటూ నేపాల్ దేశం ముందుకు రావడం చర్చనీయాంశమైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలను చర్చల ద్వారా మాత్రమే తొలగించుకోవచ్చని నేపాల్ ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొన్నారు. దాయాదుల మధ్య పరిస్థితులు చక్కబడితే దక్షిణాసియా దేశాల సార్క్ కూటమి మరింత పునరుత్తేజితమవుతుందన్నారు.కశ్మీర్ వివాదం భారత్–పాక్ల ద్వైపాక్షిక అంశమని, ఈ విషయంలో మూడో దేశం జోక్యాన్ని సహించబోమని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వానికి అమెరికా ముందుకొచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నేపాల్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. నేపాల్ ప్రకటన వాస్తవమే అయితే, కశ్మీర్ అంశంపై మధ్య వర్తిత్వానికి ఆసక్తి చూపిన తొలి దక్షిణాసియా దేశంగా నేపాల్కు గుర్తింపు లభిస్తుంది.కాగా కశ్మీర్పై మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుసార్లు వ్యాఖ్యానించినా ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదంటూ భారత్ బదులిచ్చిన విషయం తెలిసిందే.మరి తాజాగా నేపాల్ దేశం చేసిన ప్రకటనపై భారత్ ఎలా స్పందింస్తుందో చూడాలి..