అంతరిక్షంలో భారతీయులను పంపేందుకు మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలి సిందే. 2022లో గగన్ యాన్ మిషన్ ద్వారా ముగ్గరు వ్యోమగాములను ఇస్రో అంతరిక్షంలోకి పంపబోతోంది. ఈ ముగ్గురు వ్యోమ గాములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎంపిక చేశారు. వీరికి రష్యాలోని అంతరిక్ష కేంద్రంలో అవసరమైన శిక్షణను ఇవ్వనున్నారు. గగన్ యాన్ కు ఎంపికైన ముగ్గురు వ్యోమగాములు పురుషులే కావడం గమనార్హం. అయితే వీర ముగ్గురి కంటే ఓ ముందుగా ఓ మహిళను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. ఆమె పేరు ‘వ్యోమమిత్ర’. అయితే, ఇది ఓ మహిళా రోబో (మర మనిషి) కావడం విశేషం. వ్యోమగాములను అంతరిక్షంలోని పంపడం కంటే ముందే… ఈ వ్యోమమిత్రను నింగిలోకి పంప నుంది. గగన్ యాన్ లో భాగంగానే… ఈ ఏడాది చివర్లో ఈ మిషన్ ను ఇస్రో చేపట్టనుంది. ఈ మిషన్ ద్వారా వ్యోమ గాములను అంతరిక్షంలోకి పంపడమే కాకుండా… వారిని సురక్షితంగా మళ్లీ భూమిపైకి తీసుకొచ్చే ప్రయోగాన్ని ఇస్రో పరీ క్షించ నుంది. ఏదేమై నప్పటకీ భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి వ్యోమగామిగా వ్యోమమిత్ర రికార్డు పుటలకు ఎక్కనుంది.