అమరావతి:’అమరావతి నగర నిర్మాణం ప్రారంభం కాకముందే అది అతి స్పెక్యు లేటివ్ కార్యక్రమాలకు బలి అయ్యింది. అత్యం త ఆశావహమైన అభివృద్ధి అంచనాల పరంగా కూడా అది కొనసాగ గలిగింది కాదు’ అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోమవారం ట్వీట్లో వ్యాఖ్యానించారు. ‘రాజధాని పేరుతో పెద్ద ఎత్తున స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ ప్రాంతంలో జరిగింది అనటానికి ఇదొక నిదర్శనం. ప్రభుత్వం చిత్తశుద్ధితో వికేంద్రీకరణను అమలు చేస్తూ పోతే ఈ గ్రోత్ కారి డార్ చాలా కొద్ది ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా రాష్ట్రం అంతటా విస్తరిస్తుంది’ అని పేర్కొన్నారు. ‘ఏదో ఊహించుకొని వాస్తవం తో సంబంధం లేకుండా జరిగిన స్పెక్యులేటివ్ పెట్టుబడులు రాజధాని ఉన్నా లేకున్నా ఏదో ఒక రోజు అటు ఇటుగా కుప్పకూలే అవకాశాలే జాస్తి’ అని విమర్శించారు. ‘ఈ గ్రోత్ కారిడార్ భవిత ఏమిటి?’ అంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని దీనికి జత పరిచారు. అమరావతి అనిశ్చితితో అంతా అయో మయం నెలకొందని, స్థిరాస్తి వ్యాపారులు, భూములు కొన్నవారి పరి స్థితి డోలాయమానంగా ఉందని అందులో ఉంది.