సీఏఏపై వెనక్కు తగ్గం

సీఏఏపై వెనక్కు తగ్గం

జోద్‌పూర్‌ (రాజస్థాన్‌): పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుండ బద్ధలుకొట్టారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో నిర్వహించిన సీఏఏ అవగాహన ర్యాలీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌, ఇతర విపక్ష పార్టీలు ఈ చట్టం విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాయని మండిపడ్డారు. ఈ చట్టం పౌరసత్వాన్ని అందజేసేదే తప్ప, ఎవరి పౌరసత్వాన్ని తీసుకోజాలదన్నారు. మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాయని ఆరోపించారు. సత్తా ఉంటే తనతో చర్చకు రావాలని సవాలు విసిరారు. అదీ కాకుంటే తాను ఇటాలియన్‌లో దాన్ని తర్జుమా చేసి ఇస్తా… చదువుకుని తెలుసుకోండని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos