వణకుతున్న ఢిల్లీ

వణకుతున్న ఢిల్లీ

న్యూఢిల్లీ: రాజధానిని చలి పులి వణికిస్తోంది. దాదాపు 120 సంవత్సరాల తరువాత ఈ నెల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు దాఖలు కానుందని దని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రత 12.10 డిగ్రీలకు పడిపోయింది. ఇది ఇంకా తగ్గు తుందని అంచనా. ఈ ఏడాది సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 19.85 డిగ్రీలకు తగ్గింది. అది 1997 డిసెంబర్ లో 17.30 డిగ్రీ లు. 1901-2018 మధ్య 1919, 1929, 1961, 1997 సంవత్సరాల్లో గరిష్ఠ సరాసరి ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తగ్గింది. ఈ నెల 18న సఫ్దర్ గంజ్ ప్రాంతంలో 12, పాలమ్ ప్రాంతంలో 11.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 29 నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు హెచ్చరించారు. డిసెంబరు 31న వర్షం కురిసే అవకాశాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos