అమరావతి: ‘రాంగోపాల్ వర్మకు సినిమా పేరు పెట్టడం తెలియదు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం అని పేరు పెట్టాల్సింద’ని తెదేపా సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘జగన్ హయాంలో ఆయన తాత రాజారెడ్డి శైలి పాలన సాగుతోంది. చంద్ర బాబు హయాంలో కమ్మ వాళ్లు కృష్ణా, గోదావరిలో కలిసిపోయారు. నామినేటెడ్ పోస్టులు రెడ్లకు ఇచ్చినందుకు జగన్ను అభినందిస్తున్నా. జగన్ గట్స్ను మెచ్చు కుంటున్నా. చంద్రబాబుకు అంత ధైర్యం లేదు. శాసన సభలో రాయలసీమ ప్రాజక్టులపై జగన్ బాగా మాట్లాడారు. ఆశయం బాగానే ఉన్నా ఆచరణ సాధ్యమేనా? డబ్బులు లేవు. నెల్లూరులో మాఫియాలు ఉన్నాయని ఆనం అనకుండా ఉండాల్సింది. ఎక్కడ మాఫియా లేదో చెప్పమనంభ’ని ప్రశ్నించారు.