ఘనంగా రాజాజీ జయంతి

హొసూరు : ఇక్కడికి సమీపంలోని తొరపల్లి గ్రామంలో చక్రవర్తి రాజగోపాలాచారి 141వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు రాజాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొరపల్లిలో నిరుపేద కుటుంబంలో పుట్టిన రాజాజీ జాతీయ స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. తమిళనాడు మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవలు అందించారు. పేదల అభ్యున్నతి కోసం ఎంతో శ్రమించారు. ఆయన

జయంతిని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యేలు మనోహరన్‌, బి. వెంకట స్వామి,  వివిధ పార్టీలకు చెందిన నాయకులు తొరపల్లిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా గ్రామస్థులు కూడా రాజాజీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos