హోసూరు: మేతకు వెళ్లిన గొర్రెను కొండ చిలువ చుట్టి చంపేసింది. జ్యోతిపురం గ్రామానికి చెందిన వెంకటస్వామి శుక్రవారం ఉదయం తన పాతిక గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. మందు నుండి విడిపోయి మేత మేస్తున్న గొర్రెను 10 అడుగుల కొండ చిలువ గొర్రెను చుట్టి చంపేసింది. ఈ సంఘటనను చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచార మందించారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు గొర్రెకు చుట్టు నున్న కొండ చిలువను విప్పి దానిని సమీపంలోని అడవిలో వదలి వేశారు.అప్పటికే గొర్రె ప్రాణం పోయింది.