ఫేస్‌బుక్‌కు మరో భారీ షాక్‌

ఫేస్‌బుక్‌కు మరో భారీ షాక్‌

డేటా బ్రీచ్‌ ఆరోపణలతో ఇబ‍్బందుల్లో పడిన సోషల్‌మీడియా దిగ్గజ ఫేస్‌బుక్‌కు మరో షాక్‌ తగలనుంది.  భారీగా వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వారి అనుమతి లేకుండా విక్రయించిందన్న అంశాపై విచారణ చేస్తున్న సంస్థ  ఫేస్‌బుక్‌కు అత్యధిక జరిమాని విధించే దిశగా  కదులుతోంది. గోప్యతా ఉల్లంఘనలకు సంబంధించి ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించేందుకు రంగం సిద్ధమవుతోందని  తెలుస్తోంది. పలుమార్లు ప్రపంచవ్యాప్తంగా  భారీ ఎత్తున వినియోగదారుల డేటా బ్రీచ్‌ ఆరోపణల నేపథ్యంలో ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (FTC) రికార్డు స్థాయిలో జరిమానా విధించాలని భావిస్తోందని  తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. శుక్రవారం న్యూయార్క్ టైమ్స్ అందించిన నివేదిక ప్రకారం, ఫేస్‌బుక్‌పై సుమారు 16వేల కోట్ల రూపాయల (22.5మిలియన్‌డాలర్ల)కు మించి పెనాల్టీ విధించేందుకు ఎఫ్‌టీసీ యోచిస్తోంది.  2012 లో గోప్యతా ఉల్లంఘనలకు గాను గూగుల్‌పై  ఎఫ్‌టీసీ విధించిన   అత‍్యధిక జరిమానా 22.5 మిలియన్ల డాలర్లు. దీనికి మంచి ఫేస్‌బుక్‌కు  పెనాల్టీ  సెగతాకనుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ రిపోర్టు చేసింది. కాగా  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8.7కోట్ల మందిఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను ఫేస్‌బుక్ విక్రయిస్తోందనే ఆరోపణలు  ప్రకంపనలు రూపాయి.  మరోవైపు ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీకైందనే విషయాన్ని ఒప్పుకున్న ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్ అమెరికన్ పార్లమెంటరీ కమిటీ ముందుకు హజరుకావడం, భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా చూస్తామని ఆయన హమీ ఇచ్చారు. అంతేకాదు పత్రికా ప్రకటనల ద్వారా క్షమాపణలు కోరారు. అయితే ఈ నివేదికలపై  ఎఫ్‌టీసీ, ఫేస్‌బుక్‌ ఇంకా వ్యాఖ్యానించలేదు.
 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos