న్యూఢిల్లీ: దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం సూటిగా స్పం దిం చారు. హైదరాబాద్లో ఏం జరిగిందో వాస్తవాలు తనకు తెలియవని, అయితే ఎన్కౌంటర్ సహజంగా జరిగిందా కాదా అనే దానిపై విచారణ తప్పనిసరిగా జరపాలని మాత్రమే తాను ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా చెప్పదలచుకున్నానని అన్నా రు. నిందితులు పారిపోతుండగా ఎన్కౌంటర్ జరిగిందా, ఇందుకు భిన్నగా జరిగిందా అనే దానిపై విచారణ జరగాలని చిదంబ రం వ్యాఖ్యానించారు.