నెల్లూరు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న మహిళల వేతనాల పట్ల ఎలాంటి వివక్షత లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పని చేస్తు న్న పురుషుల కంటే మహిళలకు వేతనాల చెల్లింపులో తేడాలపై ఎటువంటి ఫిర్యాదులు అందాయని ఆదాల ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఆమేరకు లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద అవినీతి, నిధుల మళ్లింపు, వేతనాల ఎగవేత, పారదర్శకత లోపాలపై ఎన్నో ఫిర్యాదులు అందాయని తెలిపారు. అయితే వేతనాల చెల్లిం పు లో మాత్రం తేడా గురించి ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఎక్కువ మంది మహిళలు పాల్గొనేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే మహిళలకు పనివేళల్లో సౌల భ్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. వేతనాల్లో ఎటువంటి వివక్షతకు గురి కాకుండా మహిళల కోసం ప్రత్యేక నిబంధనలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో మహిళల నిష్పత్తి 54.57 గా ఉందని పేర్కొన్నారు. దీనిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.