విద్యార్థినికి గురువు ప్రేమలేఖలు..

విద్యార్థినికి గురువు ప్రేమలేఖలు..

సమాజంలో బాధ్యాయుతమైన,పవిత్రమైన వృత్తి ఏదైనా ఉందంటే అది ఒక్క ఉపాధ్యాయ వృత్తి మాత్రమే.తల్లితండ్రుల తరువాతం అంతటి ఉన్నస్థానం సమాజం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఇచ్చింది. అంతటి ఉన్నత స్థానంలో ఉన్నా తనలోని లేకితనాన్ని, పాడు బుద్ధిని ప్రదర్శించుకున్నాడో గురువు. శిష్యురాలికి ప్రేమలేఖలు రాసి వెంటబడుతుండడంతో అది కాస్త వివాదాస్పదమై మొత్తం విషయం వెలుగు చూసింది.అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోటలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల ఉంది. పాఠశాలలో ఐదు నుంచి తొమ్మిదో తరగతి బాలికలు చదువుతున్నారుకాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పాఠశాలలో చదువుతున్న ఒక బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరుతో బాలికను ముగ్గులోకి దింపి తరచూ ప్రేమపాఠాలు వల్లించడం మొదలు పెట్టాడు.తోటి విద్యార్థులు దీన్ని గమనించి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లడంతో సదరు ఉపాధ్యాయుడిని వారు మందలించారు. అయినా అతనిలో మార్పురాలేదు సరికదా తరచూ ప్రేమ లేఖలు రాస్తున్నట్లు గుర్తించారు.’ఒకసారి అవునంటావు. మరోసారి కాదంటావు. నేను మాత్రం ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తున్నా. నువ్వు కాదన్నప్పుడల్లా అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నిన్ను వదులుకోలేకపోతున్నా. నన్ను ప్రేమిస్తున్నానని ఒక్కమాట చెప్పు. అప్పుడు నేను ఎలావుంటానో నువ్వే చూద్దువుగాని. నువ్వు ఆల్వేజ్ మై స్వీట్ హర్ట్అంటూ లేఖల్లో తన విరహ వేదనను వెల్లడిస్తున్నాడు.విషయం కాస్తా నాలుగు రోజుల క్రితం గ్రామస్థుల దృష్టికి వెళ్లడంతో వారు పాఠశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సదరు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివాదం పై స్కూల్ ప్రిన్సిపాల్ సంగీతకుమారి వివరణ ఇస్తూవివాదం వాస్తవమేమూడు రోజుల క్రితమే సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి తప్పించి పంపించేశాంఅని తెలిపారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos