నింగిలోకి దూసుకెళ్లిన కార్టోశ్యాట్‌

నింగిలోకి దూసుకెళ్లిన కార్టోశ్యాట్‌

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో బుధవారం ఇక్కడకు సమీపంలోని సతీష్ ధావన్ రోదశీ కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ- సీ 47 వాహక నౌక 14 ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. అరగంటలోపే కార్టో శాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రం పీఎస్ఎల్వీ సంకేతాలను అందుకోనుంది.కార్టోశాట్-3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల నెట్వర్క్ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి ఇది ఉపయోగ పడ నుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టోశాట్-3ని రూపొందించింది. 1,625 కిలో బరువున్న కార్టోశాట్-3 జీవితకాలం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.350 కోట్లు ఖర్చు చేసింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లా డు తూ.. ప్రయోగంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వచ్చే మార్చి లోగా మరో 6 రాకెట్లతో 13 మిష న్లు ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ విజయం భవిష్యత్ ప్రయోగాలకు మరింత స్పూర్తినిస్తుందని ఇస్రో చైర్మన్ డా. శివ న్ అన్నా రు. పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos