విజయవాడ : ఇసుక కొరతను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ తెదేపా అధినేత చంద్ర బాబు నాయుడు గురు వారం ఇక్కడ ప్రారంభించిన 12 గంటల నిరాహార దీక్ష కొనసాగుతోంది. వైద్యులు ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేసారు. మధు మేహం,రక్త పోటు సాధారణ స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. మంచి నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచించారు.