విభిన్న చిత్రాలతో తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతపతి నటించిన కొత్త చిత్రం అదే పేరుతో తెలుగులో కూడా విడుదలకు సిద్దమైంది.ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు విజయ్ చందర్ తెలుగు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.అందులో భాగంగా చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చిత్రంలో మొదట హీరోగా పవన్ కళ్యాణ్ను అనుకున్నామన్నాడు.అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల విజయ్ సేతుపతి ఈ ప్రాతకు సరిపోతాడని భావించి అతడితో చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక ప్రజా సమస్య గురించి పోరాడే వ్యక్తిగా నటిస్తారని డైరెక్టర్ విజయ్ చందర్ అన్నారు.తెలుగు, తమిళ భాషల్లో చిత్రం విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.తమిళంలో కంటే తెలుగులోనే కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని, అందుకే ఇక్కడ సినిమాలు చేయాలనుకుంటున్నానని తన మనసులో మాటను బయటపెట్టారు.